విద్యార్థి ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్
అన్నమయ్య జిల్లా :: మిట్స్ కళాశాల విద్యార్థి ప్యాంట్ జేబులో సెల్ఫోన్ పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసుల కథనం ప్రకారం..రాయచోటికి చెందిన విద్యార్థి తనూజ్ (22) కురబలకోట మండలం అంగళ్లులోని మిట్స్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం జేబులో ఉన్న సెల్ఫోన్ ఉన్నట్లుండి పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.